by సూర్య | Fri, Oct 22, 2021, 08:07 PM
కర్నూలు జిల్లా పేరు మార్చాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దీని గురించి ఆ పార్టీ నుంచి ఓ ప్రకటన కూడా రిలీజ్ అయింది. ఆ ప్రకటన ద్వారా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ కోరారు. ఆయన పేరు ఒక్క ప్రభుత్వ పథకానికీ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేళ ఇప్పుడున్న ప్రభుత్వం జిల్లా పేరు మార్చకపోతే.. అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ ఆ పని చేస్తుందని స్పష్టం చేశారు. కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లా అని మార్చినప్పుడు అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డ సంజవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమేనని అభిప్రాయపడ్డారు. దామోదరం సంజీవయ్య గారి గొప్పదనం నాలుగు గోడల మధ్య చర్చలకే పరిమితం కారాదని, భావి తరాలకు తెలియాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Latest News