by సూర్య | Fri, Oct 22, 2021, 07:11 PM
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో ఖాళీగా ఉన్న 4 గ్రామ వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్టు స్థానిక ఎంపిడిఓ సురేంద్ర నాథ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దాసుకుప్పం , కాలమనాయుడుపేట , రాజగోపాలపురం వాలంటీర్ల పోస్టులకు ఎస్టి (జనరల్), నరసరాజు అగ్రహారం బిసిడి (జనరల్) కేటగిరికి రిజర్వు చేసినట్టు ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28, 29 తేదీల్లో సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 30 సమాచారం ఇవ్వడం జరుగుతుందన్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త వాలంటీర్లు విధుల్లో ఉంటారన్నారు.
Latest News