by సూర్య | Fri, Oct 22, 2021, 07:16 PM
దేశం మొత్తం గర్వించదగ్గ రీతుల తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెంలో జనాగ్రహ దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నవరత్నాలు అందిస్తూ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంటే అది చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన చెంచా నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి మాయ లు చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పదవి తప్ప తనకు తన మన, పాపా ప్రీతి లేదని పదవి కోసం ఎంతటి దిగజారుడు రాజకీయానికైన సిద్ధ పడే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఇలాంటి నాయకుడికి రానున్న రోజుల్లో ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఎన్ని కుట్రలు చేసిన వైఎస్సార్ పార్టీని కానీ, సీఎం జగన్ కానీ ఏమీ చేయలేడని అన్నారు. ఆయనకు ప్రజా భలం ఉందన్నారు. అనంతరం దీక్షలో పాల్గొన్న నాయకులకు నిమ్మరసం అందించి దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆయా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News