పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Fri, Oct 22, 2021, 07:10 PM

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక గంట కళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మాలో ప్రవహించేది సీమ రక్తమే. నా భర్తను చంపినప్పుడు కూడా చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మారాలి' అంటూ పరిటాల సునీత అన్నారు. ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం.. ఇంకా ఓపికతో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని పరిటాల సునీత అన్నారు. గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. పార్టీ ఆఫీసు పక్కనే డీజీపీ కార్యాలయం ఉంది. గతంలో మేం పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే వైసీపీ గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదు అని సునీత వ్యాఖ్యానించారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలో వచ్చాక శాంతిగా ఉండమని చంద్రబాబు చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే.. ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదన్నారు. పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతోన్నా చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదని చెప్పారు. మారిన చంద్రబాబు కావాలి.. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక గంట కళ్లు మూసుకుంటే చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు వంశీ, నాని వంటి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'తిట్లు మాకూ వచ్చు. మేమూ మాట్లాడగలం. మాకూ బీపీ వస్తుంది. మేం ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం' అని పరిటాల సునీత అన్నారు.

Latest News

 
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM