ఉత్తరాఖండ్‌లో 8వేల కిలోల చరాస్‌ పట్టివేత

by సూర్య | Sun, Jun 13, 2021, 03:19 PM

ఉత్తరాఖండ్‌లో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉధమ్ సింగ్‌నగర్‌లోని కిచా పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో రెండు కార్లలో తరలిస్తున్న 8వేల కిలోలకుపైగా చరాస్‌ను పట్టుకోవడంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక కారులో 1,094 కిలోల చరాస్‌, మరో కారులో 6,914 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. వారిద్దరినీ పిథోర్గఢ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. చరాస్‌ తరలించేందుకు వినియోగించిన రెండు వాహనాలను సీజ్‌ చేశారు.

Latest News

 
ధర్మవరానికి ఔటర్ రింగ్ రోడ్డు తెస్తా Mon, May 06, 2024, 01:57 PM
దేశం మొత్తం 400కు పైగా సీట్లు సాధిస్తాం: అమిత్ షా Mon, May 06, 2024, 01:55 PM
ఉమ్మడి అనంత జిల్లాలో భానుడి భగభగలు Mon, May 06, 2024, 01:52 PM
రైతుల అక్రందనే జగన్ పతనానికి నాంది: అమిలినేని Mon, May 06, 2024, 01:49 PM
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి Mon, May 06, 2024, 01:46 PM