మగాళ్లను ముంచుతున్న మాయలేడి .. ప్రేమ, పెళ్లి, ఆపై సొమ్ముతో పరార్..

by సూర్య | Sun, Jun 13, 2021, 03:22 PM

తిరుపతిలో ఓ కిలాడీ లేడీ బాగోతాలు బట్టబయలయ్యాయి. ప్రేమ పేరుతో పెళ్లిళ్లు చేసుకుని సొమ్ములతో ఉడాయించే ఆ మాయలేడీ మూడు పెళ్లిళ్లతో ముందుకెళ్తోన్న వైనం వెలుగు చూసింది. మూడో భర్త దగ్గర 6 లక్షలు దోచేసి ఉడాయించడంతో దగా పడ్డానని తెల్సుకున్న భార్యా బాధితుడు లబోదిబోమంటూ అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే, విజయపురం మండలం నారపరాజు కండ్రికకు చెందిన యువకుడు సునీల్ కుమార్. సత్యనారాయణపురంలో ఉంటున్న సుహాసిని.. తిరుపతిలో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ లో పని చేస్తూ అదే కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సునీల్ కుమార్ ను పరిచయం చేసుకుంది. ప్రేమ.. పరిణయంగా మారి గతేడాది డిసెంబర్ లో సునీల్ ను పెళ్లాడింది సుహాసిని.


కట్ చేస్తే, ఈ నెల 7న సునీల్ తో గొడవ పడిన సుహాసిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ లేకపోవడంతో ఆరా తీసిన సునీల్ కు అవాక్కయ్యే విషయాలు తెలిసొచ్చాయి. ఆమె అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుందన్న వ్యవహారం బయటపడింది. తానొక అనాధనని చెప్పి సునీల్ కుమార్ ను పెళ్లి చేసుకున్న సుహాసిని మోసాల చిట్టా బయటపడ్డంతో సునీల్ అలిపిరి పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.


సునీల్ నుంచి ఆరు లక్షలు కాజేసిన సుహాసిని ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, అప్పటికే నెల్లూరు జిల్లా కోనేటి రాజుపాలెంకు చెందిన వెంకటేశ్వర్లును పెళ్లి చేసుకున్న సుహాసిని కి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేల్చారు. ఏడాదిన్నర క్రితం మరో యువకుడిని రెండో పెళ్లి చేసుకున్న సుహాసిని, 6 నెలల క్రితం సునీల్ చేత మూడు ముళ్ళు వేయించుకుని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుని తన పరంపర కొనసాగించింది.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM