by సూర్య | Sun, Jun 13, 2021, 11:17 AM
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం, వేల్పూరులోని వినాయకుడి ఆలయంలో నంది విగ్రహం మాయమైంది. గుర్తు తెలియని అగంతకులు గత రాత్రి నంది విగ్రహాన్ని పెకలించి అపహరించినట్లు అర్చకులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా గుప్తనిధులకోసం సమీపంలోని కొండపైనున్న పురాతన శివాలయంలో ఆగంతకులు పలుమార్లు త్రవ్వకాలు జరిపారు.
Latest News