వైసీపీ నాయకులు దాడి చేశారంటూ..పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన మహిళ

by సూర్య | Sun, Jun 13, 2021, 11:00 AM

కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కంకిపాడు వైసీపీ నాయకులు తనపై దాడి చేసారంటూ ఓ మహిళ ఆరోపించింది. కంకిపాడు మండలం కోమటిగుంట లాకుల వద్ద శుక్రవారం రోజు జరిగిన ఘర్షణ కారణంగా కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‎కు వెళ్లింది. పోలీస్ స్టేషన్‎కు వచ్చే దారిలో తనను అడ్డగించి తనపై వైసీపీ నాయకులు దాడి చేసారని పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ మహిళ, మహిళ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

Latest News

 
గుత్తి ఆటో యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం పంపిణి Fri, Mar 29, 2024, 12:54 PM
శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి Fri, Mar 29, 2024, 12:53 PM
కర్ణాటక మద్యం పట్టివేత Fri, Mar 29, 2024, 12:52 PM
కాంగ్రెస్ గూటికి సొసైటీ డైరెక్టర్ ఉపేందర్ Fri, Mar 29, 2024, 12:52 PM
యువకుని శవం లభ్యం Fri, Mar 29, 2024, 12:48 PM