by సూర్య | Sun, Jun 13, 2021, 11:00 AM
కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కంకిపాడు వైసీపీ నాయకులు తనపై దాడి చేసారంటూ ఓ మహిళ ఆరోపించింది. కంకిపాడు మండలం కోమటిగుంట లాకుల వద్ద శుక్రవారం రోజు జరిగిన ఘర్షణ కారణంగా కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. పోలీస్ స్టేషన్కు వచ్చే దారిలో తనను అడ్డగించి తనపై వైసీపీ నాయకులు దాడి చేసారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ మహిళ, మహిళ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
Latest News