by సూర్య | Thu, Jun 10, 2021, 02:33 PM
పంజాబ్ నేషనల్ బ్యాంకు" పీఎన్బీ " కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చోక్సీ గర్ల్ఫ్రెండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా వ్యాఖ్యలపై చోక్సీ భార్య ప్రీతి చోక్సీ ఘాటుగా స్పందించారు. మెహుల్ తనను తాను రాజ్ అని పరిచయం చేసుకున్నాడనే బార్బరా వాదనను కొట్టిపారేశారు. నిజానిజాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఉందిగా అని ప్రశ్నించారు. అదంతా బోగస్ అని, బార్బరా ఆరోపణలకు అసలు ఎలాంటి ప్రామాణికత లేదని ప్రీతి వెల్లడించారు.
డొమినికా మీదుగా క్యూబాకు పారిపోయి అక్కడ స్థిరపడాలని చోక్సి పన్నాగం పన్నాడన్న ఆరోపణలను ప్రీతి తీవ్రంగా ఖండించారు. రాజ్గా పరిచయం చేసుకున్నాడనే దానిపై మండిపడిన ప్రీతి నిజానికి చిన్నపిల్లలు కూడా ఎవరితోనైనా స్నేహం చేసేటపుడు ఫ్రెండ్స్ లిస్ట్ను ఇంటర్నెట్లో చూస్తున్నారని, లేదా "రివర్స్ గూగుల్ సెర్చ్" సోషల్ మీడియాలో వెతుకుంటాం. ఇందుకు కొన్ని సెకన్ల సమయం చాలు.. ఇదిచాలా ఈజీ కూడా అని ప్రీతి గుర్తు చేశారు. చోక్సీ చెప్పింది గుడ్డిగా నమ్మేందుకు మనం, ఏమైనా రాతి యుగంలో బతుకుతున్నామా?! అని ప్రశ్నించారు. అంతేకాదు వాట్సాప్ సందేశాలు కంటెంట్ మార్చడం, ఫోటోషాప్ ద్వారా ఫోటోలు మార్ఫింగ్ చేయొచ్చు.. ఈ నేపథ్యంలో బార్బరా ఆరోపణలకు ఎలాంటి విశ్వసనీయత లేవని తేల్చి చెప్పారు. ఈ విషయలో ఇంత దుమారం రేగుతున్నా..ఇన్స్టాగ్రామ్లో వేలాది మంది ఫాలోవర్స్ ఆమెకు ఒక్కరు కూడా మద్దతుగా ఎందుకు నిలవలేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రకటనలతో తన భర్తపై బురద జల్లే ప్రయత్నం ఇదని, అసలు తను ఎక్కడ ఉంటోంది తదితర వివరాలను వెల్లడించని బార్బరా వెర్షన్ను ఎలా విశ్వసిస్తామని ప్రీతి చోక్సీ ప్రశ్నించారు
Latest News