by సూర్య | Tue, Jun 08, 2021, 03:35 PM
రాష్ట్రంలో జూనియర్, రెసిడెంట్ డాక్టర్లు సమ్మె సరైన్ మోగించారు. తమకు కోవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు. స్టైఫండ్లో టిడిఎస్ కోత విధించవద్దని కోరుతూ ఈ నెల 9న కోవిడ్తో సంబంధం లేని విధులను బహిష్కరించనున్నారు. 10న కోవిడ్కు సంబంధించిన విధులను కూడా బహిష్కరిస్తారు. 12న అత్యవసర విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎపి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ జిజిహెచ్ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Latest News