by సూర్య | Sat, May 29, 2021, 03:01 PM
ప్రముఖ మత గురువు కేఏ పాల్ కృష్ణపట్నం ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు. ఆనందయ్య గురించి కేఏ పాల్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయన్నారు. తన తల్లి ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందన్నారు. అందరినీ అనలేమని.. కానీ కొంతమంది దోచుకుతింటున్నారన్నారు. కరోనా ఉధృతికారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారన్నారు. ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాలన్నారు. ఆయన ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని కోరారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థలే చెబుతున్నాయి. ఆనందయ్యను విడుదల చేయాలని సీఎం జగన్, డీజీపీ, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు సీజేఐ, సుప్రీం సీజేఐలను కోరండని సూచించారు.
సరైన మందు లేని కరోనాపై పోరుకు ఆనందయ్య తమతో చేతులు కలపాలని కోరారు. ఆనందయ్యను కస్టడీ నుంచి విడుదలచేయాలన్నారు. ఆనందయ్యతో కలిసి తమ సంస్థ ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. తమ సంస్థ వెబ్సైట్లో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. మందు తయారీకి కావలసిన మెటీరియల్స్ తెచ్చుకుంటే.. మందు తయారు చేసుకుని వెళ్లొచ్చన్నారు. కావలసిన ఏర్పాట్లు చేస్తామని, ఉచితంగా శిక్షణ అందిస్తామని కేఏ పాల్ అన్నారు. ఆనందయ్య బయటకు రాగానే మాట్లాడదామన్నారు. సెక్యురిటీ పేరుతో ఆయనను నిర్బంధించారని.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
Latest News