బైక్‌పై వచ్చి కారులోని డాక్టర్ దంపతుల్ని కాల్చి చంపిన వైనం.!

by సూర్య | Sat, May 29, 2021, 10:09 AM

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ దంపతులపై ఇద్దరు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డాక్టర్‌తో పాటు ఆయన భార్య మరణించారు. ఈ ఘటన భరత్‌పూర్‌లో జరిగింది. నగరంలోని బిజీ క్రాసింగ్ వద్ద ఈ కాల్పుల ఘటన జరగడం శోచనీయం. సాయంత్రం 4.45 నిమిషాలకు సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్రాసింగ్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. కారుకు అడ్డంగా నిలిచారు. అయితే డ్రైవర్ సీటులో ఉన్న డాక్టర్‌.. కారు విండో తీస్తుండగానే.. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. పలు రౌండ్లు కాల్పులు జరిపి.. బైక్‌పై పరారీ అయ్యారు. ప్రతీకారంతోనే ఆ డాక్టర్ దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ యువతి హత్య కేసులో డాక్టర్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డాక్టర్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్న ఆ యువతిని హత్య చేశారు. డాక్టర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఆ యువతి సోదరుడిలా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఆ యువతి హత్యకు గురైంది. ఈ కేసులో డాక్టర్ భార్యతో పాటు ఆమె తల్లి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM