by సూర్య | Sat, May 29, 2021, 09:58 AM
తిరుమలలో క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. మొన్నటి వరకూ 10 వేల లోపు మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకోగా.. నిన్న 11 వేల మందికి పైగా దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని 11,055 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 52 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 3,988 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Latest News