హీరో సుశాంత్ మృతి కేసు లో.. హైదరాబాద్లో సిద్ధార్ధ్ పితాని అరెస్టు

by సూర్య | Fri, May 28, 2021, 02:10 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఇవాళ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు కీలక అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో సిద్ధార్ధ పితానిని అదుపులోకి తీసుకున్నారు. సుశాంత మృతి విషయంలో డ్రగ్స్ కోణంలో ఎన్సీబీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది జూన్ 14వ తేదీన అనుమానాస్పద రీతిలో బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ మృతిచెందాడు. ఈ కేసులో అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్టు చేసి రిలీజ్ చేసింది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన మాఫియాను పట్టుకునేందుకు ఎన్సీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హీరో సుశాంత్‌కు సిద్ధార్ధ పితాని ఫ్రెండ్‌. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండేవారు. సిద్ధార్థను విచారణ కోసం ముంబైకి తీసుకువెళ్లనున్నారు. బాంద్రా ఫ్లాట్‌లో సుశాంత్ మృతదేహాన్ని మొదట చూసింది సిద్ధార్థనే. కేదార్‌నాథ్‌, చిచోరే, ధోనీ లాంటి హిట్ చిత్రాల్లో సుశాంత్ నటించాడు.

Latest News

 
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు Sun, Apr 28, 2024, 10:19 AM
వైసీపీ మేనిఫేస్టో తుస్సుమంది: గంటా Sun, Apr 28, 2024, 10:14 AM
ఇలా చేస్తే మహిళల ఖాతాలో రూ.లక్ష Sun, Apr 28, 2024, 09:56 AM
రానున్న 5 రోజులు ముప్పు.. జాగ్రత్త: IMD Sun, Apr 28, 2024, 09:54 AM