by సూర్య | Fri, May 28, 2021, 02:03 PM
ఆనందయ్య మందుకు ఐసీఎమ్మార్, ఐఎంఏ వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని ఆయుష్ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఆనందయ్య మందుకు అనుమతి లభిస్తే లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. 2డీజీ ఔషధానికి అత్యవసర అనుమతి ఇచ్చిన ఐసీఎమ్మార్.. ఆనందయ్య మందుకు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని సౌందర్యరాజన్ ప్రశ్నించారు.
Latest News