అత్యాచార కేసులో పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు

by సూర్య | Fri, May 28, 2021, 02:20 PM

కర్ణాటకలో మహిళపై అత్యాచారం కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో క్రైమ్ సీన్ రీ క్రియేట్ చేస్తుండగా నిందితుల్లోని ఇద్దరు పారిపోయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. . ఈ కేసు వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేసింది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హింసిస్తూ ఆ దృశ్యాలను వీడియో తీశారు ఎనిమిది మంది వ్యక్తులు, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అది లీక్ అవడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలతోపాటు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను ప్రశ్నించిన పోలీసులు వారు చెప్పిన వివరాలను మీడియాకు తెలిపారు. వీరంతా ఒక గ్రూపుకు చెందిన వారని, బంగ్లాదేశ్‌ నుండి వలస వచ్చారని, ఆర్థిక లావాదేవీల విషయంలో వీరి మధ్య గొడవ రావడంతో సదరు బాధితురాలిపై దాడికి కారణమైందని భావిస్తున్నామన్నారు. బాధితురాలు కూడా బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM