by సూర్య | Mon, Apr 12, 2021, 09:48 AM
ఒడిశాలోని ఓ మహిళకు అవిభక్త కవలలు(ఆడశిశువులు) జన్మించారు. కేంద్రపడ జిల్లా రాజ్నగర్ సమితి కనా గ్రామానికి చెందిన మహిళకు ఆదివారం ఉదయం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ప్రసవం చేశారు. ఆమెకు రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లతో అవిభక్త కవలలు మృతిచెందారు. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కేంద్రపడ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం వీరిని కటక్ శిశుభవన్లో ఉంచారు. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జన్మిస్తారని, కవలలిద్దరి ఛాతి, కడుపు అతుక్కొని ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని అన్నారు.
Latest News