by సూర్య | Mon, Apr 12, 2021, 07:49 AM
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.6 లక్షలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 63,294 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 349 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,07,245కు, మరణాల సంఖ్య 57,987కు చేరింది. ముంబైలో ఆదివారం రికార్డు స్థాయిలో 9,989 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 34,008 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 27,82,161కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,65,587 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది.
Latest News