by సూర్య | Mon, Apr 12, 2021, 07:56 AM
ఐపీఎల్- 14 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో కోల్ కతా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఓపెనర్ రాణా (80), రాహుల్ త్రిపాఠి (53) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఆరంభంలోనే ఓపెనర్ వార్నర్ (3), సాహా (7) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మనీష్ పాండే (61), బెయిర్ స్టో(55) స్కోర్ రాణించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Latest News