by సూర్య | Sat, Apr 10, 2021, 02:59 PM
నెల్లూరు: వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వందల కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారించాలని సూచించారు. తిరుపతి ఓటర్లు జగన్ అహం దించాలన్నారు. పోలవరం నుంచి పెన్నా వరకు ఇసుకను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వచ్చాక పోలవరం పనులు 2 శాతం కూడా చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు.. దళారుల కేంద్రాలుగా మారాయన్నారు.
Latest News