by సూర్య | Fri, Apr 09, 2021, 05:01 PM
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైళ్లు కొనసాగుతాయా? లేదా? అనే విషయంపై రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. రైళ్లను ఆపడం లేదా తగ్గించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. రైళ్లలో ప్రయాణించాలనుకున్న వారికి రైళ్ల కొరత లేదని, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ సాధారణంగానే ఉందని, క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచుతామని అన్నారు. రైళ్లలో ప్రయాణించడానికి కరోనా నెగెటివ్ రిపోర్ట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Latest News