by సూర్య | Sat, Apr 10, 2021, 07:47 AM
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2,765 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597 కు చేరింది. అందులో ఇప్పటివరకు 8,94,896 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 11 మంది మృతిచెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,279 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,245 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Latest News