by సూర్య | Fri, Apr 09, 2021, 05:00 PM
టీటీడీ ప్రధానర్చకులు రమణదీక్షితులు సీఎం జగన్ను విష్ణుమూర్తితో పోల్చటం జగన్కే మంచిది కాదని కాకినాడలో శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద శుక్రవారం అన్నారు. సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభకు ఓటేయాలని ఆయన కోరారు. తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తున్న ముఖ్యమంత్రికి పరిపూర్ణానంద మూడు ప్రశ్నలు సంధించారు. తితిదేను సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఎందుకు తేలేదని ప్రశ్నించారు. రెండేళ్లుగా తితిదే ఆస్తులపై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆలయాల కూల్చివేతలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పింక్ డైమండ్ వ్యవహారంపై జగన్ ప్రభుత్వం విచారణ ఎందుకు చేయటం లేదన్నారు.
Latest News