రమణ దీక్షితులు వ్యాఖ్యలను సీఎం జగన్‌ ఖండించాలి: పరిపూర్ణానంద

by సూర్య | Fri, Apr 09, 2021, 05:00 PM

టీటీడీ ప్రధానర్చకులు రమణదీక్షితులు సీఎం జగన్​ను విష్ణుమూర్తితో పోల్చటం జగన్​కే మంచిది కాదని కాకినాడలో శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద శుక్రవారం అన్నారు. సీఎం జగన్​తో పాటు వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభకు ఓటేయాలని ఆయన కోరారు. తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తున్న ముఖ్యమంత్రికి పరిపూర్ణానంద మూడు ప్రశ్నలు సంధించారు. తితిదేను సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఎందుకు తేలేదని ప్రశ్నించారు. రెండేళ్లుగా తితిదే ఆస్తులపై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆలయాల కూల్చివేతలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పింక్ డైమండ్ వ్యవహారంపై జగన్ ప్రభుత్వం విచారణ ఎందుకు చేయటం లేదన్నారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM