by సూర్య | Fri, Apr 09, 2021, 04:39 PM
కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకేల ఎంఆర్పీ పెంచవద్దని ఆదేశించింది. యూరియా మినహా ఇతర ఎరువులను పాత ధరలకే విక్రయించాలని చెప్పింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచాలని ఎరువుల కంపెనీలు నిర్ణయించాయి. పెంపు సుమారు 58 శాతం ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఎరువుల ధరలు పెంచొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో రైతులకు ఊరట లభించినట్లయింది.
Latest News