by సూర్య | Fri, Apr 09, 2021, 04:46 PM
రైలు ప్రయాణికులకు అలెర్ట్. సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనులు ఉండటంతో పలు రైళ్లు రద్దయ్యాయి. మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో పలు చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖపట్నం-లోకమాన్యతిలక్ (08519) స్పెషల్ ట్రైయిన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు, లోకమాన్యతిలక్ టెర్మినల్-విశాఖపట్నం (08520) స్పెషల్ రైలు ఏప్రిల్ 11 నుంచి జూన్ 1 వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
ఇక కాజీపేట-బల్హార్షా సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-న్యూఢిల్లీ-విశాఖపట్నం (02805-02806) ప్రత్యేక రైళ్లు ఈనెల 10 నుంచి 23వ వరకు విజయనగరం, రాయగడ, టిట్లాఘర్, రాయ్పూర్, గోండియా, నాగ్పూర్ మీదుగా దారి మళ్లించించబోతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
Latest News