by సూర్య | Fri, Apr 09, 2021, 03:42 PM
శుక్రవారం ఇచ్చిన ట్వీట్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా యోగి ఆదిత్యనాథ్ కు ఘాటైన జవాబు చెప్పారు. తాము రోమియోలను ప్రేమిస్తామని స్పష్టం చేసిన మొయిత్రా ఆదిత్యనాథ్ను 'గుడ్డూజీ' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలోని కృష్ణరాంపూర్లో గురువారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో అక్కచెల్లెళ్ళు, కుమార్తెలు, మహిళల ప్రయోజనాలను కాపాడటం కోసం ఉత్తర ప్రదేశ్ తరహాలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఎంసీ రోమియోలందర్నీ కటకటాల్లోకి నెడతామని చెప్పారు. మహిళలకు బెంగాల్ ఎందుకు సురక్షిత ప్రాంతం కాదని ప్రశ్నించారు. బెంగాల్లో బాలికలకు విద్య, రవాణా ఉచితంగా అందుబాటులో ఉండాలన్నారు. బాలికల పాఠశాలల చుట్టూ తిరిగేవాళ్ళకి బుద్ధి చెప్పేందుకు యాంటీ రోమియో స్క్వాడ్ అవసరమని చెప్పారు. ఉత్తర ప్రదేశ్లో 2017లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు. యోగి వ్యాఖ్యల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం ఓ ట్వీట్ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ అధికారం చేపడితే యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తామంటున్నారన్నారు మీరు.''గుడ్డూజీ, మీలా కాదు, మా బెంగాలీలు హృదయాల్లో ప్రేమికులు! మేం మా సంగీతాన్ని, మా పద్యాలను, మా మిష్తీని, మా రోమియోలను సైతం ఇష్టపడతాం! '' అని పేర్కొన్నారు ఎంపీ.
Latest News