by సూర్య | Fri, Apr 09, 2021, 03:38 PM
కళాకారులైన ఇద్దరు అంధులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన అంధుడైన గుత్తా క్రాంతికుమార్, ఖమ్మం జిల్లాలోని తాటిపూడి గ్రామానికి చెందిన శ్రీరంగం శేషు కుమారి ఓ అంధుల కచేరి బృందంలో సభ్యులుగా ఉన్నారు. శేషు కుమారి గాయనిగా అలరిస్తుండగా.. క్రాంతికుమార్ అదే బృందంలో వాయిద్య కళాకారుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాలను ఒప్పించి బంధువులు, మిత్రులు, గ్రామస్తుల సమక్షంలో గురువారం తాటిపూడిలో వివాహం చేసుకున్నారు.
Latest News