ఇరువ‌ర్గాల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ‌.. 9 మందికి గాయాలు

by సూర్య | Fri, Apr 09, 2021, 01:42 PM

గుంటూరు జిల్లా, య‌డ్ల‌పాడు మండ‌లంలోని కారుచోల గ్రామంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య గురువారం రాత్రి ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఇరువ‌ర్గాల వారు ఒక‌రిపై ఒక‌రు రాళ్లు, సీసాల‌తో దాడులు నిర్వ‌హించుకున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం పోలింగ్‌బూత్‌లో ఓటు వేసే విష‌య‌మై టీడీపీ, వైసీపీ వారి మ‌ధ్య స్వ‌ల్ప వివాదం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో గురువారం రాత్రి ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.


సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం వారు పెట్టిన పోస్టింగ్ కూడా ఘ‌ర్ష‌ణ‌కు దారితీసిందని స‌మాచారం. ఈ ఘ‌ర్ష‌ణ‌లో 9మంది గాయ‌ప‌డ్డారు. విష‌యం తెలుసుకున్న చిల‌క‌లూరిపేట రూర‌ల్ సీఐ ఎం సుబ్బారావు, ఎస్ ఐ రాంబాబు, పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఇరువ‌ర్గాల వారిని చెద‌రగొట్టారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM