by సూర్య | Fri, Apr 09, 2021, 01:42 PM
గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలోని కారుచోల గ్రామంలో ఇరువర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు, సీసాలతో దాడులు నిర్వహించుకున్నారు. గురువారం మధ్యాహ్నం పోలింగ్బూత్లో ఓటు వేసే విషయమై టీడీపీ, వైసీపీ వారి మధ్య స్వల్ప వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఓ వర్గం వారు పెట్టిన పోస్టింగ్ కూడా ఘర్షణకు దారితీసిందని సమాచారం. ఈ ఘర్షణలో 9మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం సుబ్బారావు, ఎస్ ఐ రాంబాబు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Latest News