by సూర్య | Fri, Apr 09, 2021, 01:17 PM
పొదుపు మంచిదే. కాని అతి పొదుపు అనర్థమే. కనీస అవసరాలు కూడా తీర్చుకోవడానికి సాహసించని పొదుపు ప్రాణాలను తీస్తుంది. అచ్చం అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ విద్యాధరపురం. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురంకు చెందిన గాయత్రిని విజయవాడ విద్యాధర పురానికి చెందిన మహేష్ కు ఇచ్చి గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేశారు.
ఎన్నో ఆశలతో కాపురానికి వెళ్లిన ఆ యువతికి భర్త ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది. ప్రతి రూపాయిని లెక్కిస్తూ మరీ పిసినారిగా వ్యవహరించడంతో ఆమె విసుగు చెందింది. చివరకు విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. అంతా సర్దుకుంటుంది క్రమంగా మారుతాడులే అంటూ గాయత్రికి తల్లిదండ్రులు సర్ది చెప్పారు.
రోజులు మారుతున్న భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది గాయత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై గాయంత్రి తండ్రి తన అల్లుడి ప్రవర్తన కారణంగానే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
Latest News