by సూర్య | Fri, Apr 09, 2021, 01:05 PM
ఐపీఎల్ ఫెస్టివల్ కు రంగం సిద్దమైంది. నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 14 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబయి, బెంగళూరు మధ్య జరగనుంది. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఆరంభ మ్యాచ్ లో ఎవరు అదరగొడతారన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లున్న నేపథ్యంలో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ లో బెంగళూరుపై ముంబయి కి మంచి రికార్డు ఉంది. అప్పటి వరకు ఈ రెండు జట్లు 27 మ్యాచ్ ల్లో తలపడగా ముంబయి 17 మ్యాచ్ లు విజయం సాధించగా బెంగళూరు 10 నెగ్గింది. ఇప్పటికే ఐదు సార్లు టైటిల్ ఎగరేసుకుపోయిన ముంబయి.. టోర్నీలో మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న టోర్నీని ఈ సారైనా ముద్దాడాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. చూడాలి మరి ఎవరి మంత్రం ఫలిస్తుందో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయగలరు.
Latest News