by సూర్య | Fri, Apr 09, 2021, 12:54 PM
బీజేపీ తీరు వివాదాస్పదంగా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని పంచయాతీ ఎన్నికల్లో ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెనెగర్ భార్య సంగీతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అత్యాచారం కేసులో కుల్దీప్ సెనేగర్ ను బీజేపీ తన పార్టీ నుడి బహిష్కరించింది. ప్రస్తుతంగా సంగీత ఉన్నావ్ జిల్లా పంచాయతీ చైర్ పర్సన్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఫతేపూర్ చౌరాసితృతయా సీటు నుంచి బరిలో దిగారు. ఇదిలా ఉంటే బహిష్కృత ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇవ్వడం పై బీజేపీ పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా అత్యాచారం కేసులో కుల్దీప్ సెనెగర్ పదేళ్ల జైలు శిక్ష పడింది. తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన ఓ బాధితురాలి తండ్రిని హత్య చేయడంతో పాటు బాధితురాలికి నిప్పు పెట్టి చంపేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన పాపానికి ఆ బాధితురాలిని క్రూరంగా హత్య చేశారు. నేరం రుజువు కావడంతో ఎమ్మెల్యేలతో పాటు మరి కొంత మందికి కోర్టు శిక్ష విధించింది.
Latest News