by సూర్య | Wed, Apr 07, 2021, 05:07 PM
నీటిపారుదల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో నీటిపారుదలపై రూ. 64 వేల కోట్ల వ్యయం. పోలవరం డ్యామ్ పనులు 71 శాతం పూర్తిచేశామన్న ఆయన. శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. డీపీఆర్-2కు ఆమోదం తెప్పించుకోలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన వైసీపీకు 28 మంది ఎంపీలున్నా ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సర్వం అవినీతిమయం చేశారని ఉమ ధ్వజమెత్తారు.
Latest News