by సూర్య | Wed, Apr 07, 2021, 05:02 PM
బ్యాంకు కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. డిపాజిట్ పరిమితిని పెంచుతూ బుధవారం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ పేమెంట్స్ డిపాజిట్ లిమిట్ను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందంటూ పేర్కొంది. దీంతో పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు లాభం చేకూరుతుందని.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీనివల్ల చిన్న తరహా వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రకటించారు.
Latest News