by సూర్య | Wed, Apr 07, 2021, 04:45 PM
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన జట్టుకట్టాలని ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యనించారు. సీఎం జగన్ను ఎదుర్కోవాలంటే అందరూ కలసి ప్రయత్నించక తప్పదన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. లోపాయికారిగా జనసేన - బీజేపీకు- టిడిపి సహాయపడుతోందని ఆరోపించారు. సొంత అభిప్రాయాలు లేకుండా జనసేన అధ్యక్షుడు పవన్ పూటకోమాట మాట్లాడుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. తిరుపతి ఉపఎన్నికలోనూ వైసీపీ విజయం ఖాయమని చెప్పారు.
Latest News