by సూర్య | Wed, Apr 07, 2021, 04:17 PM
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన భర్తనే హతమార్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. గత నెల 20న రాత్రి మైకేల్ జాన్(40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో మైకేల్జాన్ భార్యే తన ప్రియుడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. జాన్ భార్యకు వరుసకు మామ అయ్యే వినోద్ తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఎలాగైనా వినోద్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్న జాన్ భార్య.. భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. అతడిని హతమార్చేందుకు ప్రియుడు వినోద్ తో కలిసి ప్లాన్ వేసింది. టీబీ డ్యాం పీఎల్సీ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మద్యం మత్తులో ఉన్న జాన్ పై బండరాయితో దాడి చేసి చంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో భాగంగా మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు వినోద్, అశోక్ లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Latest News