by సూర్య | Wed, Apr 07, 2021, 03:36 PM
వాహనాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నా సరే తప్పకుండా మాస్క్ ధరించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా మాస్క్ ధరించే పబ్లిక్ ప్లేసుల్లోకి రావాలని, మాస్క్ లేకుండా రాకూడదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఒంటరిగా వెళ్తున్న సమయంలో కూడా మాస్కు పెట్టుకోలేదని పోలీసులు జరిమానా విధిస్తున్నారంటూ ఢిల్లీకి చెందిన లాయర్ సౌరభ్ శర్మ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, పోలీసులు జరిమానా వేయడాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చారు. కారులో ఒంటరిగా ఉన్నా, ఏ వాహానంలో ఉన్నా సరే పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చేటప్పుడు మాస్క్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
Latest News