by సూర్య | Wed, Apr 07, 2021, 03:30 PM
ఏపీలో పరిషత్ ఎన్నికల పై హైకోర్టు తన తీర్పును వెలువరించింది. పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మాత్రం ఫలితాలను వెలువరించవద్దని కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 4 వారాలు ఎన్నికల కోడ్ అమలు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దాని పై విచారించిన కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో రేపు యదాతథంగా ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు మాత్రం పెండింగ్ లో ఉంటాయి. ఇప్పటికే ఈసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది.
Latest News