by సూర్య | Wed, Apr 07, 2021, 03:17 PM
తమిళనాడులోని మెట్టుపాలయం ఫారెస్టులో ఓ ఏనుగు పిల్ల బురద గుంతలో పడిపోయి తన తల్లి నుంచి విడిపోయింది. ఈ క్రమంలో ఫారెస్ట్ గార్డ్ పళనిచామి శరత్ కుమార్ ఆ ఏనుగు పిల్లను బయటకు తీసి ప్రాణాలతో కాపాడాడు. ఆ తర్వాత ఆ ఏనుగు పిల్లను తన భుజాలపై మోసుకెళ్లి.. తల్లి వద్ద దింపాడు. ఈ ఘటన 2017లో చోటు చేసుకోగా, మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరు ఈ వార్త ఇప్పటికే చదివి ఉంటారు. నాటి వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
Latest News