by సూర్య | Wed, Apr 07, 2021, 01:20 PM
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు చెక్కు విడుదల చేసింది. ఈ చెక్కును బుధవారం గుడిపూడి గ్రామంలో మృతుని తండ్రి శాఖమూరి రవీంద్ర బాబుకు గుంటూరు ఆర్డిఓ ఎస్ భాస్కర్ రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, తహసిల్దార్ ఎస్వి రమణ కుమారి అందించనున్నారు.
Latest News