by సూర్య | Wed, Apr 07, 2021, 12:41 PM
దేశంలో కొన్ని రోజుల క్రితం బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాత పడ్డాయి. అయితే దేశంలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని పాంగ్ డాంగ్ సరస్సు వద్ద గత 2 వారాల వ్యవధిలో 100కు పైగా వలస పక్షులు చనిపోయాయి. జనవరి నెలలో దాదాపుగా 5000 వేలకు పైగా పక్షులు మృత్యువాత పడ్డాయి. అయితే మార్చి 25 నుంచి ఫ్లూ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. హెచ్5ఎన్1 రకం వైరస్ రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ గా మారిందని, పక్షుల్లో రెండు కొత్త స్ట్రెయిన్ లను గుర్తించినట్టు భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Latest News