by సూర్య | Wed, Apr 07, 2021, 12:02 PM
ఐపీఎల్ 14వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ లీగ్ ను కరోనా వైరస్ వెంటాడుతోంది. తాజాగా ఆర్సీబీ టీం ఆల్రౌండర్ డేనియెల్ సామ్స్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించింది.
ఆస్ట్రేలియా ఆటగాడైనా డేనియెల్ సామ్స్ ఏప్రిల్ 3న నెగెటివ్ రిపోర్టుతో బెంగళూరు శిబిరానికి చేరుకున్నాడు. తాజాగా చేసిన పరీక్షలో పాజిటివ్ రాగా.. అతడిని ఐసోలేషన్ కు పంపించామని ఆర్సీబీ తెలియజేసింది. తమ వైద్య బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోందని, బీసీసీఐతో సహకరిస్తోందని ఆర్సీబీ ట్వీట్ చేసింది.
Latest News