by సూర్య | Wed, Apr 07, 2021, 11:51 AM
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన స్పందించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని చెప్పారు. టిప్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదేనని రుజువైందన్నారు..
కోర్టుల మార్గదర్శకాలు ధిక్కరించడం సీఎం జగన్ మానాలని చంద్రబాబు హితవు పలికారు. ఎస్ఈసీ చట్టప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని. రబ్బర్ స్టాంపుగా మారకూడదన్నారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిందని. కొత్త ఓటర్లకు అవకాశమిచ్చేలా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Latest News