by సూర్య | Tue, Apr 06, 2021, 05:37 PM
భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపింది. కిరణ్ మోరే ప్రస్తుతం ముంబై జట్టు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్గా ఉన్నారు.
మోరేకు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ టీం, కిరణ్ మోరేకు బీసీసీఐ హెల్త్ గైడ్ లైన్స్ పాటిస్తున్నాం. బీసీసీఐ ప్రొటోకాల్స్ కు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ముంబై టీం అభిమానులందరూ సురక్షితంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నట్లు’ ముంబై ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది.
Latest News