by సూర్య | Tue, Apr 06, 2021, 05:40 PM
ఏపీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పు పై ఈసీ,ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లాయి. దీని పై రాత్రి విచారణ జరిగే అవకాశం ఉంది. కోడ్ అమలులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని టీడీపీ పిటిషన్ వేయగా హైకోర్టు విచారణ చేసింది. ఎల్లుండి 513 జెడ్పీటీసీ, 7,230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల జరగాల్సి ఉండగా హైకోర్టు స్టే విధించింది. డివిజన్ బెంచ్ ఎటువంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
Latest News