by సూర్య | Tue, Apr 06, 2021, 05:28 PM
జమ్మూ కాశ్మీర్ లోని గాంధీనగర్ ఏరియాలో గల గ్రీన్ బెల్ట్ పార్కులో ఇద్దరు వ్యక్తులపై చిరుత పులి అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఒరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు బొలెరో వాహనంలో కొన్ని మొక్కలను తీసుకొచ్చారు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ చిరుతపులి ఓ వ్యక్తిపై దాడి చేసింది. వెంటనే పక్కనున్న మరో వ్యక్తి కర్రతో కొట్టగా కొంతదూరం వెళ్లి మళ్లీ దాడికి ప్రయత్నించింది. ఇంతలో ఆ ఇద్దరూ వాహనంలోకి ఎక్కి డోర్ లు వేయడంతో ప్రమాదం తప్పింది.
Latest News