ఏపీలో కరోనా టెన్షన్..ఆ 5 జిల్లాల్లో డేంజర్ బెల్స్

by సూర్య | Tue, Apr 06, 2021, 05:22 PM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 31,657 శాంపిల్స్ ని పరీక్షించగా1,941 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 424, చిత్తూరు జిల్లాలో 232, విశాఖపట్నం జిల్లాలో 2285, కృష్ణాజిల్లాలో 212 కేసులు నమోదవగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 9,08,048 కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 8,88,9888 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో 835 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 11,809 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో ఏడుగురు మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 7,251కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,52,70,771 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Latest News

 
దేవుడు మీద ఒట్టు, నేను ఎటువంటి భూములు ఆక్రమించలేదు Wed, May 01, 2024, 05:39 PM
న్యాయవ్యవస్థను సైతం చంద్రబాబు మోసం చేశారు Wed, May 01, 2024, 05:39 PM
ఏఓబీలో 22, 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం Wed, May 01, 2024, 05:13 PM
ఇండియా కూటమిని గెలిపించండి: సునీతా Wed, May 01, 2024, 05:11 PM
బ్రహ్మంగారిమఠం మండలంలో అశోక్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం Wed, May 01, 2024, 05:09 PM