by సూర్య | Tue, Apr 06, 2021, 12:21 PM
ఇండియాలో కరోనా కకావికలం చేస్తుంది. తాజాగా దేశవ్యాప్తంగా సోమవారం 96,982 మంది వైరస్ బారిన పడ్డారు. కొత్తగా 446 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 1,65,547కి చేరింది. వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో పలు రాష్ట్రాలు కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుండగా తాజాగా ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Latest News