రెండోస్థానం కోసం టీడీపీ-బీజేపీ పోటీ: కన్నబాబు

by సూర్య | Tue, Apr 06, 2021, 12:18 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీకి భయం పట్టుకుందని అందుకే పరిషత్ ఎన్నికల నుంచి ఆ పార్టీ పారిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం అయిపోయిందని టీడీపీ, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు.


గతంలో పవన్ భారీ డైలాగ్‌లు చెప్పారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. తిరుపతిలో మోదీ ప్రత్యేక హోదా హామీ పవన్‌కు గుర్తులేదా? అని కన్నబాబు ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలు అంటూ ఎద్దేవా చేసింది పవన్‌కు గుర్తులేదా అని విమర్శించారు.

Latest News

 
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య Sat, Apr 20, 2024, 01:05 PM
భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం Sat, Apr 20, 2024, 12:53 PM
23న చీరాలలో షర్మిల రోడ్ షో... ఆమంచి నామినేషన్ Sat, Apr 20, 2024, 12:51 PM
బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు Sat, Apr 20, 2024, 12:49 PM
టిడిపి జనసేన ను వీడి వైసీపీలో చేరిన వంద కుటుంబాలు Sat, Apr 20, 2024, 12:49 PM