పనిమనిషి మోజులో భర్త..

by సూర్య | Mon, Apr 05, 2021, 10:29 AM

గర్భంతో ఉన్న భార్య ఇంటి పనిలో సాయంగా ఉంటుందని పనిమనిషిని పెట్టుకోవడమే ఆమెకు శాపంగా మారింది. పనిమనిషితో ప్రేమలో పడిన భర్త ఆమెతో రాసలీలలు సాగించాడు. చివరికి ఆమెను విడిచి ఉండలేక కట్టుకున్న భార్యని బయటికి గెంటేశాడు. కనీసం పిల్లలను చూడడానికి కూడా పనిమనిషి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ దారుణాలను భరించలేక భార్య పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లో జరిగింది.


అహ్మదాబాద్ నగరంలోని నికోల్ ఏరియా పార్శనాథ్‌ టౌన్‌షిప్‌‌లో నివాసముంటున్న ముకేష్ వ్యాస్, అల్కా వ్యాస్ భార్యభర్తలు. పదిహేనేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె(15), కుమారుడు(14). కొడుకు గర్భంతో ఉన్నప్పుడు ఇంటి పనిలో సాయంగా ఉంటుందని బాపునగర్‌కి చెందిన హెతల్ అనే మహిళను పనిమనిషిగా పెట్టుకున్నారు. అదే ఆ ఇల్లాలి పాలిట శాపంగా మారింది.పనిమనిషి హెతల్‌, భర్త ముకేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమె మోజులో పడిపోయిన ముకేష్ భార్యని హింసించడం మొదలుపెట్టాడు. ఇద్దరి వ్యవహారం తెలిసి భార్య నిలదీయడంతో పనిమనిషితో కుంజ్ సొసైటీకి మకాం మార్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పనిమనిషి హెతల్‌ను వదిలేది లేదని.. ఇద్దరితోనూ ఉంటానని ముకేష్ చెప్పడంతో భార్య ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.


అప్పటి నుంచి ఇంట్లో పనిమనిషి హెతల్ పెత్తనం మొదలైంది. ఇంటి నిర్ణయాలు కూడా ఆమె తీసుకునేది. ఇద్దరూ కలసి మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన సోదరుడిని చంపేస్తానని బెదిరించారని అల్కా వాపోయింది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో తనను ఇంటి నుంచి గెంటేశారని.. తన పుట్టింటికి చేరానని ఆవేదన వ్యక్తం చేసింది. తన పిల్లలను చూసేందుకు కూడా ఒప్పుకోకపోవడంతో వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 12:40 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM