by సూర్య | Mon, Apr 05, 2021, 10:26 AM
అమరావతి: భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు ఆర్పించారు. జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన మానవతావాది బాబూజీ అని కొనియాడారు. గాంధీజీ ఆయన్ను బాబు జగ్జీవన్ రామ్ అమూల్య రత్నగా పిలిచారని చంద్రబాబు గుర్తు చేశారు. సామాజిక వివక్ష, అసమానతలు లేని ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం ఆయన కృషి చేశారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పోరాడదామని పిలుపునిచ్చారు. భారత స్వరాజ్య ఉద్యమంలోనూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా జగ్జీవన్ రామ్ భారత దేశ నిర్మాణంలోస్ఫూర్తి వంతమైన సేవలు అందించారని నారా లోకేశ్ అన్నారు.
Latest News